Parkinsons disease: ఆయుర్వేదం కంపవాతం గురించి ఏమంటుంది?
Parkinsons disease: అతను నలభైనిండిన మంచి మనిషి. ఏ
అనారోగ్యం లేదు. మొన్నటిదాకా తన పనులు తాను హాయిగా చేసుకుంటూండేవాడు. ఈ మధ్య
నడుస్తుంటే ఒళ్లు వణుకుతోంది. ముందు
చేతులు వణికేవి, తర్వాత నడుము, ఇప్పుడు
నడుస్తూంటే ఇటూ అటూ ఒణికిపో తూన్నాడు. దీన్ని కంపవాతం లేదా పార్కిన్సన్స్ వ్యాధి
(Parkinsons disease) అంటారు.
18వ శతాబ్ధంలో జేమ్స్ పార్కిస్సన్ అనే ఆంగ్లవైద్యుడు
ఒళ్లు వణుకు వ్యాధి
అనే పేరుతో
మొదట
దీన్ని నిర్వహించాడు. అందువల్ల దీన్ని పార్కిన్సన్స్ వ్యాధి అంటారు.
ఈ వ్యాధి
వేదకాంలోనే
ప్రస్తావించబడింది.
ఆయుర్వేద సంహితలలో అంటే
ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రంలో
ఈ వ్యాధి,
దాని లక్షణాలు, చికిత్స
పేర్కొనబడ్డాయి. నాటి
ఆచార్యులు దీన్ని
కంపవాతమన్నారు. 2500 సంవత్సరాలకి పూర్వమే
నైజింగ్ (Nei Jing) అనే చైనా
వైద్య శాస్త్రంలో
దీని గురించిన
ప్రస్తావన ఉంది. కంపవాతం ఆయుర్వేదరీత్యా ఒక
నరాల
జబ్బు.
జనాభాలో ఒక
శాతం వారికి
ఈ వ్యాధి
వచ్చినా,
వృద్ధాప్యంలో వచ్చే నాల్గోవ
ముఖ్యమైన
వ్యాధి ఇది.
ముఖ్యంగా 66 ఏళ్లు వయస్సు తర్వాత వస్తుంది. ఈ
వ్యాధి సోకిన
మనిషి
కదలికలో వ్యత్యాసం కనిపిస్తుంది. కూర్చొని,
పడుకొనివున్నంతసేపూ బాగుంటాడు.
కానీ లేచినిలబడి కదలబోతే
శరీరం
వణికి
ఇటూఅటూ కదిలిపోతూ పడిపోతుంటాడు.
Parkinson's disease: అంతుచిక్కని వ్యాధి కంపవాతం!
మొదట్లో
కొంచెం కొంచెంగా
ఉన్నా, కాలం
గడుస్తున్నకొద్దీ ఇది
దీర్ఘవ్యాధియై
పూర్తి అస్వస్థతకి
లోనవుతాడు.
దురదృష్ట
మేమంటే, ప్రపంచమంతా మేధావులు,
శాస్త్రజ్ఞులు
ఎన్నో పరిశోధనలు చేసినా మందుల
వల్ల
కానీ, ఆపరేషన్ వల్ల కానీ, నరాల మార్పిడి వల్ల కానీ
ఏ రకంగానూ దీనికి
శాశ్వత
నివారణ
కాదు కదా, తాత్కాలిక పూర్తి
ఉపశమనం కూడా
ఇంత వరకూ రాలేదు.
డా.జార్జి కోటిజన్ (Dr.George
Cotzias) లివోడోపా (Levodopa) అనే మందు
కొంత ఉపకరిస్తుందన్నా
డు. ఈ
వ్యాధి కారణం అనూహ్యం. ఇప్పటికీ దీనికి
అసలు
చికిత్స లేకపోయినా కొన్ని
విషాహార పదార్థాలు లేదా
మందులవల్ల కొంత ఉపయోగం వుంటుంది.
ఎందుకంటే ఇది
సాధారణంగా
పారిశ్రామిక నగరాల్లో ఎక్కువగా వస్తుంది.
పరిశ్రమల వల్ల వచ్చే
వాతావరణ కాలుష్యం వల్ల పుట్టే విషపదార్థాల వల్ల నరాలు
దెబ్తతిని
ఈ వ్యాధి
వస్తుందని ఒక సర్వే తెలుపుతుంది.
మరో ఆశ్చర్యమేమంటే, మన దేశంలో 19.5% భారతీయులలో
ఈ వ్యాధి
కనిపిస్తే,
ఈ దేశంలో
ఉండే ఆంగ్లో
ఇండియన్స్లో4%
మాత్రమే
ఈ వ్యాధి
వచ్చినవాళ్లు ఉన్నారు.
కారణం
మాత్రం పరిశోధనల కందలేదు.
సాధారణ
పరిస్థితుల్లో
సుమారు రెండు
వేల న్యూరాన్లు
సబ్స్టేన్టియా
నిగ్రా (Sabstantia Nigra) నుండి ప్రతి సంవత్సరం పోతాయి. కాని
మొత్తం న్యూరాన్లలో 40 శాతం అంటే
ఒక లక్షా 60 వేల న్యూరాన్లు పోతే ఈ
వ్యాధి వస్తుంది. గొప్ప
విచిత్రమేమంటే
ఎందుకింద నష్టం జరుగుతోందో శాస్త్రజ్ఞులకి
అర్థం కావడం లేదు.
కంపవాతం యొక్క లక్షణాలు
జన్మతః వచ్చిన అనూహ్యమైన కారణాలు కావచ్చును. బయటనుండి మనలోకి వెళ్లే విషపదార్థాల వల్ల ఇది జరగటం అదీ కొంతమందిలోనే జరగటం, ఇప్పటికీ అర్థం కాని సృష్టి రహస్యం. మరి ఆయుర్వేదం దీని గురించి సువివరంగా చర్చించింది.
ప్రాచీన భారతశాస్త్రాలలో ఇదొక వ్యాధి పేరుతో చెప్పకపోయినా కంపవాతంగా ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రస్తావించింది. వాతం వల్ల వచ్చే ఒణుకును కంపవాతమంటారు. వేపతు అంటే ఒణకటం, ప్రవేపన అంటే సర్వ శరీరం ఒణకటం. శిరోకంప అంటే తల తనకి తెలియకుండానే బ్యాలెన్స్ కోసం తప్పించడం వంటి లక్షణాలుంటే అది కంపవాతంగా గుర్తించాలి.
ఆధునిక శాస్త్రరీత్యా మన శరీరంలో నరాలలో ఓత కణాలని న్యూరాన్లు అని అంటారు. మన తలలో కదలికలను నియంత్రించే భాగంలో ఉన్న ఈ న్యూరాన్లు కారణం లేకుండా శైథిల్యం చెందటం లేదా పాడైపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
మన శరీరంలో సర్వత్రా వ్యాపించివున్న నరాల్లో శక్తి మన ప్రతి కదలికలకీ కారణమవుతున్నది. ఆ అద్భుతశక్తే వాతం, బొడ్డు కింద ఉన్న ఈ నరాలశక్తిని అపానవాతమంటారు. అరవై సంవత్సరాల వయస్సు తర్వాత క్రమంగా ఈ నరాలశక్తి, అక్కడున్న కండరాల శక్తి సన్నగిల్లుతుంది. దానివల్ల మలబద్ధకం, మూత్రబాధలు వస్తాయి.
వాటి వల్ల రక్తంలోని వ్యానవతం మార్పుచెంది తలలోకి చేరి మధ్య మెదడును స్పందనా కేంద్రాన్ని చేరుస్తుంది. అక్కడున్న జీవకణాలు శైథిల్యం చెంది శరీరం పూర్తిగా ఒణకడం ప్రారం భమవుతుంది. దీనివల్ల అలసట, బద్ధకం, చికాకు, జీవితంలో తెలీని నిర్లిప్తత వస్తాయి. ముందు అరచేతులు, తర్వాత చేతులు, కాళ్లు కింది దవడ తర్వాత ముఖం చివరకి శరీరమంతా ఒణుకు తుంది. కాళ్లు, చేతులు, పొట్ట బిగుసుకుపోతాయి.
నడక కుంటుపడుతుంది. అశక్తత ఏర్పడుతుంది. నడిచినా, నిలబడ్డా స్థిరత్వం కుదరక తగిన రీతిలో కాళ్ళు కదపలేకపోవడం, చివరికి అన్నం తినాలన్నా, నీళ్ళు తాగాలన్నా కష్టపడవలసి వస్తుంది. మనిషి ముందుకి ఒంగిపోతుంటాడు. స్వరం మారుతుంది.
ఎవరిని చూసినా భయం, ఏడుపు వస్తుంటాయి. ఇవి కాకుండా కండరాల్లో నొప్పి, భ్రమ, ఏదీ అర్థం కాని అయోమయం పరిస్థితి, నిద్రపట్టక పోవడం,చర్మం బెళుసుగా తయారవడం, మలబద్ధకం, నిర్లిప్తత, భయం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, శక్తి తగ్గడంతో పాటు మూత్ర సంబంధ బాధలు కూడా ఉంటాయి.
కంపవాతం నివారణ మార్గాలు
అప్పుడే వండిన
ఆహారపదార్థాలు నూనె
తక్కువగా ఉండే కూరలు, శరీరాన్ని,
మనస్సుని విశ్రాంతిగా
ఉంచుకోవడం,
గోరువెచ్చని
నువ్వుల నూనెతో
శరీరానికి
మర్దన చేయించుకోవడం,
పచ్చని లేదా ఎర్రని రంగుబట్టలు వేసుకోవడం, ఈ వ్యాధిలో
వాతాన్ని సరిచేస్తాయి. ఈ
పార్కిన్ సన్స్ వ్యాధికి
ఆయుర్వేదంలో చక్కటి నివారణోపాయాలు
చెప్పబడ్డాయి.
అవి పంచకర్మ, ఔషధాలు, ఆహారం అని మూడు విధాలుగా ఉంటుంది. పంచకర్మ చికిత్సలలో అభ్యంగనం బలా అశ్వగంధ తైలంతో కాని, శ్రీ మహా ఘాషతైలంతో కాని కీళ్లు కండరాలకు మసాజ్ అభ్యంగనం చేయించుకోవడం చాలా మంచిది. స్వేదనం అంటే శరీరానికి కావడం ద్వారా చెమట పట్టించుకోవడం ఎనిమా అంటే వస్తి చికిత్స.
Parkinsons disease: కంపవాతం నివారణ ఔషధాలు
కపికచు అని ఒక
అద్భుత మూలిక,
దీని విత్తనాలు చక్కటి పోషక పదార్థాలతో నిండి ఉంటాయి.
ముఖ్యంగా దీనిలో
ఈ వ్యాధికి
కావాల్సిన L.dopa అనే
ద్రవ్యం
ఉంటుంది. ఇది
ఉదయం,
సాయంత్రం పాలతో తీసుకోవడం
చాలా హితకరం. అశ్వగంధ, జీడిపప్పు,
వెల్లుల్లి, బ్రాహ్మీ,
శంఖ పుష్పి
చాలా ఉపకరిస్తాయి. ముఖ్యంగా
రోజూ వెల్లుల్లి
రసం
ఒక గ్లాసు
పాలతో
పుచ్చుకుంటే, ఈ
వ్యాధి లక్షణాలు చాలా
తగ్గుతాయని ఇటీవల
పరిశోధనలలో
తేలింది.
కంపవాతం తగ్గడానికి తీసుకునే ఆహారం
బాసుమతీ బియ్యంతో అన్నం, గోధుమ రొట్టెలు, బార్లీ మంచివి. క్యారెట్టు, క్యాలీఫ్లవరు, వెల్లుల్లి, చిక్కుడు, మామూలు ఉల్లి, బంగాళాదుంపలు, కందిపప్పు, మినప్పప్పు చాలా మంచివి, కారం ఎక్కువ తినకూడదు. ద్రాక్ష, నారింజ, బత్తాయి, అరటిపళ్లు, అప్పడే పిండిన పాలు, నెయ్యి, వెన్న, ఆవాలు తీసుకోవడం మంచిది. ఈ వ్యాధి కష్టసాధ్యమే కాని అసాధ్యం కాదు. ఆయుర్వేదం మంచి నివారణనిస్తుంది.
0 comments:
Post a Comment