![]() |
Ayurveda for Blood Pressure: గుప్పెడంత గుండె మన ఛాతీలో రెండు గాలి ద్వీపాల మధ్య కార్డియం అనే పొరని కప్పుకొని నియమంగా, నిశ్చలంగా తపించే ఒక యోగి!. ఈ గుండె తన క్రమాన్ని, నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా, తక్కువగా కొట్టుకున్నా అది మన జీవనాన్ని శాసించే వ్యాధి.
దాన్నే రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ లేదా బ్లడ్ ప్రెషర్ అంటాం. 19వ శతాబ్ధపు తొలి 50 సంవత్సరాలు ఈ రక్తపు పోటు చాలా వరకు మరణానికి కారణమైంది. కాని 1950 తర్వాత కొత్త మందులు రావడం వల్ల తగ్గినా, ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా బ్లడ్ప్రెషర్ వచ్చి చాలా ఉపద్రవాలకి కారణమవుతోంది. గుండె హఠాత్తుగా ఆగిపోయే స్థితికి ఇదీ ఓ కారణం.
Ayurveda for Blood Pressure : రక్తపోటు అంటే ఏమిటి?
ఒక మోటారుకు నాలుగు రబ్బరు గొట్టాలు కట్టబడి ఉన్నాయనుకోండి. ఆ మోటారు నీళ్ళని ఆ గొట్టాల్లోకి పంపు చేస్తుంది. దాని అవసరమైన మోటారు పవరు ప్రెషరు అంటారు. అదే గుండె దానికి అనుసంధానం చేయబడిన రక్తనాళాలకి రక్తం అందించే పవర్ని బ్లడ్ప్రెషర్ (BP) అంటారు. ఇది ముఖ్యంగా రెండు స్థితులపై ఆధారపడి ఉంటుంది. గుండె కండరాలు పంపు చేసే శక్తి, రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంత వరకు తీసుకుంటాయో ఆ శక్తి.
అందుకోసం హృదయం తన కండరాల గోడలని ముడుచుకొని మళ్లీ తెరుచుకుంటుంది. అప్పుడు చిన్న శబ్ధం వస్తుంది. అదే లబ్డబ్ అని. ఈ బ్లడ్ ప్రెషర్ని రెండు స్తితుల్లో గమనిస్తారు. గుండె పూర్తిగా ముఖుళించుకునే స్థితిని సిస్టాలిక్ (Systolic) అంటారు.
పూర్తిగా విచ్చుకునే స్థితిన డయ స్టాలిక్ అంటారు. అది చూసే ఆధునికులు వాడే పరికరాన్ని స్పిగ్నోమోనోమీటర్ అంటారు. ఆరోగ్య వంతమైన నడివయస్సు వారికిది 120 సిస్టాలిక్ 80 MM డయస్టాలిక్ (Dias tolic) ఉంటుంది.
ఈ రక్తపు పోటు ఎక్కువ శ్రమ పొందినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, మానసిక ఆందోళన పొందినప్పుడు ఎక్కువవతూ ఉంటుంది. జీవనయానంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్న నగర జీవనంలోనూ, అమెరికా, యూరప్ తదితర దేశాలలో ఇది ఎక్కువగా ఉంటున్నది. మన దేశంలో నగరాలలో ఉండే నడివయస్సు వాళ్లలో ప్రతీ నాలుగోవ్యక్తి ఈ బ్లడ్ ప్రెషర్లో మార్పులు కనిపి స్తున్నాయి.
గ్రామాలలో 60 ఏళ్ల వయసులో ఉన్నవారిలో ఈ హైబ్లడ్ప్రెషర్ కనిపిస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాలలో, నగరాల్లో ఎదుర్కొనే ఒత్తిడితో కూడిన జీవనం, మానసిక ఆతృత, శరీర శ్రమ తక్కువ ఉండటం వల్ల ఈ హైబ్లడ్ప్రెషర్ వస్తున్నదని నిపుణుల భావన.
ఈ వ్యాధి స్త్రీ, పురుషులిద్దరికీ సమానంగా వస్తున్నా, వ్యాపార, వృత్తిపరమైన ఒత్తిడి ఉన్నవాళ్లలో తొందరగా కనిపిస్తుంది. రక్తనాళాల లోపలి పొర గట్టిపడిపోవడం, దీనిని ఆర్టీరియో స్కలోరిసిస్ అంటారు.
మూత్రపిండాల వ్యాధుల్లో ఈ బ్లడ్ప్రెషర్ (Ayurveda for Blood Pressure) ఉంటుంది. రక్తంలోనే వచ్చే మార్పులు, లావుగా ఉండటం. ఉప్పు కారాలు ఎక్కువగా తినటం, అందుకే ఆవకాయ పచ్చళ్లు తిన్నాక మజ్జిక అన్నం ఎక్కువ తినాలి. పొగత్రాగటం, ఆల్కహాలు ఎక్కువగా తీసుకోవడం.
నిద్ర ఆపుకొని మెలుకువగా ఉండటం. ఊరికే కోపం తెచ్చుకోవడం, తరచు నిర్లిప్తతకు లోను కావడం, భయం, ఆతృత, కోపం తెచ్చుకోవడం. పెద్ద పెద్ద ఆశలతో ఉండి వాటికోసం తెలియని మానసిక, శారీరక శ్రమ. ఇవేవీ లేకుండా తల్లిదండ్రుల నుంచి ఆ వయస్సులో వచ్చే హైబ్లడ్ప్రెషర్ కూడా ఉంటుంది.
రక్తపోటు వ్యాధి లక్షణాలు
తరచూ తలనొప్పి రావడం, నడినెత్తిలో బరువు భారం నొప్పి ఉండటం. తల తిరిగినట్లుండటం, పడుకొని లేచిన వెంటనే తల తిరగడం. ఛాతీ బరువుగా ఉండటం. ముఖ్యంగా డయస్టాలిక్ ప్రెషర్ పెరగడం మంచిది కాదు. మామూలుగా కొద్దిగా పెరిగితే అది ఏ లక్షణాలని కలుగచేయదు. ఈ స్థితి చాలాకాలం తగ్గకుండా ఉంటే హఠాత్తుగా తలలో రక్తం (Blood) గడ్డకట్టి, పక్షవాతం రావచ్చు.
మూతి వంకరపోవచ్చు. ఒక్కొక్కప్పుడు ఈ రక్తపోటు కిందకి పడిపోవచ్చు. దీన్ని లో బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది హఠాత్తుగా నిలబడినప్పుడు కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీకాలంలో కూడా ఈ స్థితి రావచ్చు. అది జాగ్రత్తగా చూసుకోపోతే తల్లికి ఉపద్రవం రావచ్చు.
ఆయుర్వేదం వాత, పిత్త, కఫాలు తమ స్థితిలో మార్పు పొందితే ఈ వ్యాధి జరుగుతుంది. జీర్ణ సంబంధమైన కారణాలు, అధికమైన ఒళ్ళు, తీవ్ర ఆందోళన వంటివి కారణమంటుంది ఆయు ర్వేదం. బ్లడ్ ప్రెషర్ మనల్ని మంచం మీద పడుకోపెట్టదు. కాబట్టి అశ్రద్ధచేస్తే హఠాత్తుగా కబళించి పక్షవాతాలను తెస్తుంది. ముఖ్యంగా చాలాకాలం నుంచి ఉన్న షుగరు వ్యాధి ఈ బ్లడ్ప్రెషర్ కి కారణమౌతుంది. షుగర్ ని జాగ్రత్తగా నియంత్రించుకోవాలి.
అధికమైన ఒళ్లు ఉంటే అది గుండెని, రక్తవాహికల గోడలను లావు చేస్తుంది. అప్పుడు ఈ బ్లడ్ప్రెషర్ (Ayurveda for Blood Pressure) పెరగవచ్చు. జీవన విధానం ఆందోళనలతో నిండినది కాకుండా ప్రశాంతంగా జీవించగలిగితే ఈ వ్యాధి రాదు. చక్కటి పళ్ల రసాలు, గ్లాసు మజ్జిక రెండుసార్లు తాగటం మంచిది.
రక్త పోటు తగ్గాలంటే ఏమి ఆహారం తినాలి?
ద్రాక్షరసం రోజూ ఒక ఔన్సు తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇది తగ్గాలంటే ఆహారంలో, మన కదలికలో, ఆలోచనల్లో మార్పు తెచ్చుకోవాలి. ఆహారంలో ఉప్పు తక్కువ తినండి. అప్పడాలు, చిప్స్, బాగా నిలువ ఉన్న ఊరగాయలు తినకండి.
పండ్లు, కూరగాయాలతో నిండిన చక్కటి ఆహారం తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉన్న చిక్కుడు, తోట కూర కాడల కూర వంటివి తినడం మంచిది. ఆహారంలో ఉప్పుకి బదులు సైంధవ లవణం వాడటం మంచిది. కొవ్వు పదార్థాలు అంటే నూనెలో వేయించిన వేపుళ్ళు తినవద్దు. ప్రతిరోజూ ప్రాణాయామం కనీసం ఇరువై నిమిషాలు చేయడం మంచిది.
సర్పగంధ, జఠామాంసి, గుగ్గులు వంటి ఆయుర్వేద మందులు చక్కగా పనిచేస్తాయి. అరిపాదాలను నువ్వుల నూనెతో రాత్రి పరుండేముందు మర్ధన చేయించుకొని పడుకోవడం చాలా మంచిది.
వారానికి ఒకసారి నువ్వుల నూనెతో మర్దన చేసుకొని, తలంటుకోవడం హితకరం. ప్రతిరోజూ ఉదయం పావుగ్లాసు నిమ్మరసంలో తేనె (honey) కలుపుకుని తాగటం మంచిది. కాకర కాయల రసం రోజూ ఒక ఔన్సు తాగితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది.
వెల్లుల్లి మంచిది. రెండు వెల్లుల్లి రెబ్బలని నేతిలో కొద్దిగా వేడిచేసి తిని, మజ్జిగ తాగితే మంచిది. పెద్ద ఉసిరికాయల రసం ఒక ఔన్సు ప్రతీ ఉదయం తీసుకుంటే చాలా హితం.
ఆయుర్వేదంలో (Ayurveda for Blood Pressure) మందులే కాకుండా శిరోవస్తి అనే ప్రత్యేక చికిత్స ఉన్నది. ఎప్పటికీ తగ్గని బ్లడ్ప్రెషర్ని ఈ చికిత్స బాగుపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కడినించో వచ్చే వ్యాధి కాదు. మనకి మనం తెచ్చుకునే వ్యాధి. జాగ్రత్తగా ఉంటే అది మనని ఏం చేయదు. జాగ్రత్త మరి!.

0 Comments