rose water for skin: గులాబీ నీళ్లతో ట్రై చేయండి అందం మీ సొంతం
rose water for skin: చర్మాన్ని మెరుగుపర్చడంలో గులాబీ నీళ్లు ప్రత్యేక రెమిడీగా ఉపయోగపడుతుంది. చర్మంపై ఉన్న మచ్చలు, మృతకణాలు తొలగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. గులాబీ నీళ్లు ముఖానికి పట్టించడం వల్ల అందం మెరుగుపడి నవయవ్వనంలా కనిపిస్తారు.
rose water for skin: గులాబీ నీళ్లతో ట్రై చేయండి అందం మీ సొంతం
గంధం పొడి,
పసుపు, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు
నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.
అర టీ స్పూన్ కీర (keera) రసంలో కొద్దిగా రోజ్వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
ముల్తానీ
మట్టిలో చెంచా బంగాళదుంప గుజ్జు, నాలుగు చుక్కల రోజ్వాటర్ కలిపి ముఖానికి ప్యాక్లా
వేసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపర్చుకోవాలి. మర్నాటికి చర్మం
తాజాగా తయారవుతుంది. రోజ్వాటర్ని కళ్ల చుట్టూ దూదితో అద్దుకుని కాసేపు విశ్రమించాలి.
టమాటా గుజ్జు
ఒక టీ స్పూను, పెరుగు ఒక టీ స్పూన్, రోజువాటర్ (rose water) అర టీ స్పూన్ బాగా కలిపి ముఖం, మెడపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో
ముఖాన్ని కడుక్కుని, ఆ తర్వాత చల్లటి నీటితో మరోసారి కడుక్కోవాలి. వీటిలో మీ
చర్మతత్వానికి అనువుగా ఉన్నదాన్ని ఎంచుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కీరదోస రసంలో రోజ్వాటర్, గ్లిజరిన్ (glycerin) చుక్కలు వేసి ముఖానికి రాసుకుంటే చర్మం (skin) నునుపుదనాన్ని సంతరించుకుంటుంది.
నిమ్మరసంలో
రోజ్వాటర్ కలిపి రాత్రి వేళ పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా కొద్ది రోజులు
క్రమంగా తప్పక చేస్తే ముఖంపై మొటిమలు తొలగిపోతాయి.
రెండు టీ
స్పూన్ల పసుపులో టీ స్పూను రోజ్వాటర్ కలిపి పేస్టు చేసి, ముఖంపై అప్లై చేసి ఆరిన
తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
పొడిబారిన చర్మానికి గులాబీనీళ్లు ఎంతో మేలు చేస్తాయి. నీళ్లలో దూదిని ఉండలుగా చేసి వేసి ఫ్రిజ్లో పెట్టాలి. మర్నాడు వాటితో ముఖాన్ని తుడుచుకుంటే చర్మ సంబంధ సమస్యలు దూరమవుతాయి.
మేకప్ తొలగించుకున్న ప్రతిసారి గులాబీ (gulabi) నీళ్లతో ముఖం కడుక్కోవడం, తుడుచుకోవడం చేయాలి. దీనివల్ల మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అంతేకాదు దీనివల్ల యాక్నె, మొటిమల సమస్యలు అదుపులో ఉంటాయి.
కొందరు జలుబు చేసినప్పుడు, ఫేషియల్ చేయించుకున్నప్పుడు ముఖానికి ఆవిరిపడుతుంటారు. ఒక్కోసారి ఆవిరి ఎక్కువై చర్మం కందిపోతుంది. అలాంటప్పుడు ముఖానికి ఈ నీళ్లు రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
పావు చెంచా గులాబీనీళ్లతో నాలుగు కుంకుమ పువ్వు రేకలు వేయాలి. మర్నాడు మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావు గంటయ్యాక కడిగేయాలి. తరుచూ చేస్తుంటే మేని చక్కని చాయను సంతరించుకుంటుంది.
పెసరపిండి, ముల్తానీ మట్టి సమపాళ్లలో కలిపి అందులో కొద్దిగా గులాబీనీళ్లు చేర్చుకుని మిశ్రమం తయారు చేసుకోవాలి. ముఖం, మెడకు పూత వేసుకుని ఆరాక కడిగేసుకుంటే (rose water for skin) పొడి చర్మతత్వం దూరమవుతుంది.
ఆరోగ్యానికి గులాబీ రేకుల నీళ్లు
తాజా లేదా ఎండ బెట్టిన గులాబీ రేకులు ఒక గుప్పెడు తీసుకోవాలి. అవి రంగు మారే వరకు అంటే పావుగంట ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ మీద కాగపెట్టి ఆపివేయాలి. చల్లారాక గాజు సీసాలోకి వడకట్టాలి. రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆరు రోజుల వరకు ఉంచొచ్చు. అర లేదా ఒక కప్పు గులాబీ నీళ్లను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి. దీనివల్ల బరువు (weigh loss) తగ్గుతారు.